Telugu Grammar MCQ Quiz in বাংলা - Objective Question with Answer for Telugu Grammar - বিনামূল্যে ডাউনলোড করুন [PDF]

Last updated on Mar 8, 2025

পাওয়া Telugu Grammar उत्तरे आणि तपशीलवार उपायांसह एकाधिक निवड प्रश्न (MCQ क्विझ). এই বিনামূল্যে ডাউনলোড করুন Telugu Grammar MCQ কুইজ পিডিএফ এবং আপনার আসন্ন পরীক্ষার জন্য প্রস্তুত করুন যেমন ব্যাঙ্কিং, এসএসসি, রেলওয়ে, ইউপিএসসি, রাজ্য পিএসসি।

Latest Telugu Grammar MCQ Objective Questions

Top Telugu Grammar MCQ Objective Questions

Telugu Grammar Question 1:

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికినది ఎవరు గుర్తించండి 

  1. శ్రీ శ్రీ 
  2. రాయప్రోలు సుబ్బారావు 
  3. శ్రీనాధుడు 
  4. దాశరధి కృష్ణమాచార్య 

Answer (Detailed Solution Below)

Option 4 : దాశరధి కృష్ణమాచార్య 

Telugu Grammar Question 1 Detailed Solution

సరైన సమాధానం : దాశరధి కృష్ణమాచార్య 

కీలక అంశం : 

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరధి కృష్ణమాచార్య అన్నారు. దాశరధి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనను దయ్యబడుతూ గర్జించారు.

అదనపు సమాచారం : 

  • దాశరధి గా పేరు గాంచిన దాశరధి కృష్ణమాచార్య జులై 22,1925 న జన్మించారు. 
  • దాశరధి కృష్ణమాచార్య తెలంగాణకు చెందిన కవి, రచయిత, నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు
  • దాశరధి కృష్ణమాచార్య రచనలు అగ్నిధార, రుద్రవీణ, నేత్ర పర్వం, నవమి మొదలైనవి రచించారు. 

పైన అంశాలు గమనించగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది దాశరధి కృష్ణమాచార్య అని మనం చెప్పవచ్చు.

Telugu Grammar Question 2:

జీవిత గమనం ఏ సమాసం గుర్తించండి 

  1. ద్వంద్వ సమాసం 
  2. వవిశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం 
  3. షష్టి తత్పురుష సమాసం 
  4. ద్విగు సమాసం 

Answer (Detailed Solution Below)

Option 3 : షష్టి తత్పురుష సమాసం 

Telugu Grammar Question 2 Detailed Solution

సరైన సమాధానం : షష్టి తత్పురుష సమాసం 

కీలక అంశం : 

జీవిత గమనం అనగా జీవితం యొక్క గమనం అని అర్ధం. ఇది షష్టి తత్పురుష సమాసం. 

షష్టి తత్పురుష సమాసం:షష్టి తత్పురుష సమాసం నందు పూర్వపదము షష్టి విభక్తిలో ఉండును. 

అదనపు సమాచారం : 

ద్వంద్వ సమాసం: ఇందులో సాధారణంగా రెండు పదాలుంటే ఆ రెండు పదాల అర్ధము ప్రధానమే అవుతుంది. ఉదా: ఎండ వానలు = ఎండ మరియు వాన  

ద్విగు సమాసం:సంఖ్యలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది. 

ఉదా : వెయ్యి రూపాయలు = వెయ్యి సంఖ్య గల రూపాయలు 

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం: సమాసములోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా ఉండును

.ఉదా : ఆది కావ్యము = ఆది యైన కావ్యము 

ఉదాహరణ : 

వేద శాఖలు = వేదముల యొక్క శాఖలు 

పైన అంశాలు గమనించగా జీవిత గమనం అనేది షష్టి తత్పురుష సమాసం అని మనం చెప్పవచ్చు. 

Telugu Grammar Question 3:

అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు - గీత గీసిన పదం యొక్క అర్థాన్ని గుర్తించండి

  1. చేతులు

  2. నిలయము
  3. దర్శనం
  4. పాదములు

Answer (Detailed Solution Below)

Option 2 : నిలయము

Telugu Grammar Question 3 Detailed Solution

సరైన సమాధానం: “నిలయము”

కీలక అంశాలు:

  • కరములు అంటే చేతులు అని అర్థం.  
  • ఆకరములు అంటే నిలయమైనవి అని అర్థం.  
  • పాదములుని చరణములు అని అంటారు.
  • అమ్మ చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు అని ఇచ్చిన వాక్యానికి అర్థం.
  • దర్శనము (vision): చూపు, చూసుట అని అర్థం. ఉదా: నాకు దేవుని దర్శనము బాగా జరిగినది.
  • ఎంపికల్లో ఉన్న పదాలను మనం గమనించగా ‘నిలయము’ సరైన సమాధానం అవుతుంది అని మనం చూడవచ్చును. 

Telugu Grammar Question 4:

భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత

  1. ఎర్రన
  2. పాల్కురికి సోమనాధుడు

  3. తిక్కన

  4. శ్రీనాథుడు

Answer (Detailed Solution Below)

Option 4 : శ్రీనాథుడు

Telugu Grammar Question 4 Detailed Solution

సరైన సమాధానం: “శ్రీనాథుడు

కీలక అంశాలు:

  • ఎంపికల్లో ఉన్న రచయితల గురించి, వారి రచనలను గమనిద్దాం.
  • ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసాడు. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు.
    • ఈయనకు "శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు" అనే బిరుదులు కలవు.
    • ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు.
    • ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం: స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
  • పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. మిగితా ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.
    • పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు.
    • మార్గ కవిత్వమునకు నన్నయ ఆదికవియైతే- దేశ కవిత్వమునకు పాల్కురికి సోమన్న తోవ తీర్చి ఆదికవియైనాడు.
    • బిరుదులు: ప్రథమాంధ్ర విప్లవ కవి, దేశీ కవిత్వోద్యమ పితామహుడు.
    • రచనలు:
      • పద్య ప్రకృతులు: అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకం
      • లఘుకృతులు: బసవరగడ, నమస్కార గద్య, శరణుబసవ గద్య, బసవాష్టకం, బసవోదాహరణం, బసవలింగ నామావళి.
      • ద్విపద కావ్యాలు: బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమదేవి పురాణం (అలభ్యం).
    • పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలానికి చెందినవాడు. పరిశోధకులు పాల్కురికి సోమనాథుణ్ని ‘తెలంగాణ ఆదికవి’గా పేర్కొంటారు. తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు.
    • తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి సుస్థిర స్థానం సంపాందించి పెట్టిన వారిలో పాల్కురికి ఆద్యుడు, అగ్రగణ్యుడు. పాల్కురికి సోమనాథుడు ద్విపద కావ్య ప్రక్రియకు ఆద్యుడు. ఉదాహరణ కావ్య రచనకు మార్గదర్శకుడు.
    • సంఖ్యా నియమం, మకుట నియమం ఉన్న మొదటి శతకం ‘వృషాధిప శతకం’ ఇతని రచనే.
    • పాల్కురికి సోమనాథుడి తొలి రచన అనుభవసారం.
    • తెలుగు సాహిత్యంలో శుద్ధమైన తొలి దేశీ స్వతంత్ర పురాణంగా బసవ పురాణం పేరొందింది. ఇది ఏడు ఆశ్వాసాల ద్విపద కావ్యం. సమకాలీన సమాజాన్ని చిత్రించిన తొలి తెలుగు సాంఘిక కావ్యం బసవ పురాణం.
    • ‘ఉరుతర పద్యోక్తులకంటే సరసమై ఎరిగిన జాను తెనుగు’ అన్న కవి పాల్కురికి సోమనాథుడు.
    • ఇతడి చివరి కృతి పండితారాధ్య చరిత్ర. తెలుగులో తొలిసారిగా జీవిత చరిత్ర రాసింది పాల్కురికి సోమనాథుడే అని విమర్శకుల అభిప్రాయం. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా పండితారాధ్య చరిత్రను విమర్శకులు ప్రశంసించారు.
  • తిక్కన: 13వ శతాబ్దం నాటి కొట్టరువు తిక్కన నెల్లూరు నివాసి. ఇతను మనుమసిద్ధి మంత్రి. 'ఉభయ కవి మిత్రుడు', 'కవిబ్రహ్మ' అనే బిరుదులు ఉన్నాయి.
    • తిక్కన మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు  రాశాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు.
    • తిక్కన శివకేశవుల అభేదాన్ని ప్రకటించాడు. తన తొలి రచన 'నిర్వచనోత్తర రామాయణం' కావ్యాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు.
    • తిక్కన కవితా రీతులు: రసాభ్యుచిత బంధం, నాటకీయత, ధ్వని (వ్యంగ్య) వైభవం, రాజనీతి, తెలుగుదనం
    • తిక్కన కంద పద్యాలకు ప్రసిద్ధి. తిక్కన శిష్యుడైన కేతన తన తొలి కథా కావ్యమైన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు.
  • శ్రీనాథుడు: సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం లేదా కావ్య యుగం అంటారు. కవిత్రయంతో తులతూగగల కవి శ్రీనాథుడు. అందుకే 15వ శతాబ్దానికి యుగకర్తగా శ్రీనాథుడిని పేర్కొంటారు.
    • కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో  శ్రీనాథుడు విద్యాధికారిగా పనిచేశాడు.
    • విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో 'గౌడడిండిమభట్టు'ను కవిత్వంలో ఓడించి కనకాభిషేకాన్ని పొందాడు. అలగే కవి సార్వభౌముడు అనే  బిరుదు కూడా పొందాడు.
    • చిన్నారి పొన్నారి వయసులో - 'మరుత్తరాట్చరిత్ర' రాశాడు. ఇది అలభ్యం. శ్రీనాథుడి తొలి కావ్యం. మామిడి వేమనకి అంకితమిచ్చాడు.
    • నూనూగు మీసాల వయసులో - 'శాలివాహన సప్తశతి' రాశాడు. ఇది కూడా అలభ్యం. దీన్ని గాథాసప్తశతికి అనువాదంగా భావించవచ్చు.
    • 'పండితారాధ్య చరిత్ర' రాసి మామిడి ప్రెగడయ్యకు అంకితం ఇచ్చాడు. ఇదీ లభ్యం కాలేదు.
    • 'నిండు జవ్వనం'లో - శృంగార నైషధం రాశాడు. శ్రీహర్షుడి నైషధాన్ని శ్రీనాథుడు ఒక అనువాద ప్రణాళికతో తెనిగించాడు. దీన్ని మామిడి సింగనకి అంకితమిచ్చాడు.
    • 'హరవిలాసం'లో శివుని మహిమలు, లీలల గురించి రాశాడు.
    • ప్రౌఢ వయసులో శ్రీనాథుడు 'భీమఖండం' రాశాడు.
    • 'శివరాత్రి మాహాత్మ్యం' అనే కావ్యాన్ని శ్రీనాథుడు వృద్ధాప్యంలో రాశాడని పేర్కొంటారు.
    • శ్రీనాథుడు 'పలనాటి వీరచరిత్ర'ను ద్విపద కావ్యంగా రాసి మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు. ఇది తెలుగులో తొలి వీరగాథా కావ్యం.
    • చాటుపద్యాలు రాసి ప్రజల దగ్గరకి పద్యాన్ని తీసుకెళ్లినవాడు శ్రీనాథుడు.
    • శ్రీనాథుడు సీసపద్య రచనలో అందెవేసిన చేయి. శ్రీనాథుడి కవిత్వంలో ఉభయవాక్ఫ్రౌఢి, ఉద్దండలీల, సూక్తివైచిత్రి, రసాభ్యుచిత బంధం అనే కవితా గుణాలుఉన్నాయి.
    • భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత - శ్రీనాథుడు
  • ఎంపికలలో ఉన్న కవుల గురించి గమనించగా ‘శ్రీనాథుడు’ సరైన సమాధానం అవుతుంది. 

Telugu Grammar Question 5:

ఈ క్రింది వానిలో వీరభద్ర విజయంని రచించినది ఎవరు

  1. పావులూరి మల్లన

  2. కందుకూరి రుద్రకవి

  3. బమ్మెర పోతన

  4. అల్లసాని పెద్దన

Answer (Detailed Solution Below)

Option 3 :

బమ్మెర పోతన

Telugu Grammar Question 5 Detailed Solution

సరైన సమాధానం: బమ్మెర పోతన

కీలక అంశాలు:

  • ఎంపికల్లో ఉన్న రచయితల గురించి, వారి రచనలను గమనిద్దాం.
  • పావులూరి మల్లన తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంథకర్త. ఇతను గణితసార సంగ్రహము అనే గణితగ్రంథాన్ని వ్రాశాడు.
  • కందుకూరి రుద్రకవి తెలుగు కవి. తెలుగులో లభ్యమౌతున్న మొట్టమొదటి యక్షగానము అయిన 'సుగ్రీవవిజయం' కర్తగా ప్రసిద్ధుడు.
    • శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి కూడా ఒకడని లోకోక్తి.
    • రుద్రకవి రచనలలో "సుగ్రీవ విజయం" మొదటిది. ఇది యక్షగానం. ఇది కందుకూరి జనార్ధన దేవునికి అంకితం కావించాడు.
    • "నిరంకుశోపాఖ్యానం" ఇతడి రెండవ రచన. ప్రబంధ గ్రంథమైన నిరంకుశోపాఖ్యానాన్ని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు.
    • రుద్రకవిని చిరస్థాయిగా నిలిపినది అతని "జనార్ధనాష్టకం". ఈయన "కందుకూరి జనార్థనా" అనే మకుటంతో జనార్థనాష్టకాన్ని రచించాడు. తెలుగులో అష్టక రచన చేసినవారిలో మొదటివాడు కందుకూరి రుద్రకవి.
  • బమ్మెర పోతన: పోతన రచనలు: నారాయణ శతకం, వీరభద్ర విజయం, భోగినీ దండకం, మహాభాగవతం(తెలుగులో).
    • పోతన బిరుదు: సహజ పండితుడు
    • పోతన కొంతకాలం ఓరుగల్లుకి ప్రభువైన మూడో సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నారు. సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు.
  • అల్లసాని పెద్దన: ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు.
    • సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి శ్రీ కృష్ణదేవరాయల చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు.
    • పెద్దన రచించిన మనుచరిత్ర(స్వారోచిషమనుసంభవము) ప్రథమ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినది.
    • లభ్యంకాని రచనలు: హరికథా సారము, రామస్తవ రాజము, అద్వైత సిద్ధాంతము, చాటుపద్యాలు.
  • ఎంపికలలో ఉన్న కవులు, రచయితల గురించి గమనించగా ‘వీరభద్ర విజయం’ రచయిత  – ‘బమ్మెర పోతన’ సరైన సమాధానం అవుతుంది. 

Telugu Grammar Question 6:

నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని పలికినది ఎవరు 

  1. పోతన 
  2. సోమనాధుడు 
  3. చేమకూర వెంకట కవి 
  4. శ్రీనాధుడు 

Answer (Detailed Solution Below)

Option 4 : శ్రీనాధుడు 

Telugu Grammar Question 6 Detailed Solution

సరైన సమాధానం : శ్రీనాధుడు 

కీలక అంశం : 

  • నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని శ్రీనాధుడు అనడంలో అర్ధం శ్రావణానందం కలిగించే భాషలో చెబుతానని మాత్రమే అర్దం. 
  • సంస్కృత విద్వాంసులు శ్రీనాధుడిని డుమువుల కవి అని హేళన చేశారు.

అదనపు సమాచారం : 

  • శ్రీనాధుడు 1365 ప్రకాశం జిల్లాలో జన్మించారు. 
  • ఈతనికి కవి సార్వభౌముడను అని బిరుదు ఉంది. 
  • ఈయన భీమేశ్వర పూరాణం, కాశీ ఖండము, హర విలాసము , క్రీడాభిరామము మొదలైనవి రచించారు. 

పైన అంశాలు గమనించగా నా కవిత్వంబు నిజము కర్ణాట భాష aని పలికినది శ్రీనాధుడు అని మనం చెప్పవచ్చు.

Telugu Grammar Question 7:

క్రింది వానిలో జాతీయం కానిది ఏది గుర్తించండి 

  1. మంత్రాలకు చింతకాయలు రాలతాయ 
  2. అతివృష్టి -అనావృష్టి 
  3. గంగిరెద్దు 
  4. కాకి గోల 

Answer (Detailed Solution Below)

Option 1 : మంత్రాలకు చింతకాయలు రాలతాయ 

Telugu Grammar Question 7 Detailed Solution

సరైన సమాధానం : మంత్రాలకు చింతకాయలు రాలతాయ

కీలక అంశం : 

మంత్రాలకు చింతకాయలు రాలతాయ అనేది ఒక సామెత. సంప్రదాయబద్ధమైన నమ్మకానికి వ్యతరేఖంగా వచ్చినది.

అదనపు సమాచారం : 

  • ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం. 
  • జాతీయాలనే పదబంధాలనీ , పలుకుబడులనీ అంటారు. 
  • విడివిడి మాటలు కలిసి విశేషార్ధంలో ఏర్పడేది జాతీయం. 

ఉదాహరణ : 

నత్తనడక = ఏదైనా పని తొందరగా చేయని సందర్భంలో ఉపయోగిస్తారు. 

పైన అంశాలు గమనించగా జాతీయం కానిది మంత్రాలకు చింతకాయలు రాలతాయ అని మనం చెప్పవచ్చు.

Telugu Grammar Question 8:

‘కావ్యాలంకార చూడామణి’ అనే గ్రంథ రచయిత ఎవరు

  1. విన్నకోట పెద్దన

  2. చరిగొండ ధర్మన

  3. చదలవాడ మల్లన

  4. అద్దంకి గంగాధరుడు

Answer (Detailed Solution Below)

Option 1 :

విన్నకోట పెద్దన

Telugu Grammar Question 8 Detailed Solution

సరైన సమాధానం: “విన్నకోట పెద్దన

కీలక అంశాలు:

  • విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు రచించిన 'కావ్యాలంకారచూడామణి' అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను. ఇది తెలగులో తొలి అలంకార గ్రంథం.
  • చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన కవి. చరిగొండ గ్రామానికి చెందిన ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు. 
    • పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చరిగొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల అతడిని ఆ జిల్లావాడుగా పరిగణించడం జరిగింది.
  • విప్రనారాయణ చరిత్రని రచించినవాడు చదలవాడ మల్లన.
  • అద్దంకి గంగాధర కవి (సా.శ.1550 - 1580) గోల్కొండ రాజ్యానికి (నేటి తెలంగాణ ప్రాంతం) చెందిన తెలుగు కవి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. భారతంలోని తపతీ సంవరణుల కథను స్వీకరించి తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధం రచించి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చాడు.
  • ఇచ్చిన ఎంపికలని గమనించగా ‘విన్నకోట పెద్దన’ సరైన సమాధానం అవుతుంది.

Telugu Grammar Question 9:

క్రింద ఇచ్చిన వాటిలో ‘మౌక్తికము’ అనే పదానికి వికృతి పదం కాని దానిని గుర్తించండి.

  1. ముత్తెము
  2. ముత్తియము
  3. ముత్యము
  4. ముత్తము 

Answer (Detailed Solution Below)

Option 4 : ముత్తము 

Telugu Grammar Question 9 Detailed Solution

సరైన సమాధానం: “ముత్తము

కీలక అంశాలు:

  • సంస్కృతి, ప్రాకృత శబ్దాలను ప్రాకృతిక/ప్రకృతి పదాలు అంటాము.
  • సంస్కృత, ప్రాకృత పదాల నుండి పుట్టినవి తత్సమ/ తద్భవ పదాలు. ఈ తద్భవ పదాలనే వికృతి పదాలు అంటాం. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.
  • మౌక్తికము(నామవాచకం) అనగా ముత్యము అని అర్థం.
  • మౌక్తికము’ అనే ప్రాకృతిక పదానికి వికృతి పదాలు: ముత్తెము, ముత్తియము, ముత్యము
  • ఎంపికలలో ఉన్న పదాలని గమనించగా “ముత్తము” సరైన సమాధానం అవుతుంది.

Telugu Grammar Question 10:

‘ఆలస్యం, తాత్పరం’ అనే అర్థాలనిచ్చే పదం

  1. వేగం
  2. విలంబం
  3. రయము

  4. జవము

Answer (Detailed Solution Below)

Option 2 : విలంబం

Telugu Grammar Question 10 Detailed Solution

సరైన సమాధానం: విలంబం

కీలక అంశాలు:

  • ఎంపికల్లో ఉన్న పదాలను, వాటి అర్థాలను మనం గమనిద్దాం.
  • వేగము(నామవాచకం): త్వరితము/శీఘ్రము, తొందరగా అని అర్థాలు. వేగమునకు వ్యతిరేక పదం – నిదానము
  • విలంబం: నెమ్మది, ఆలస్యం, తాత్పరం. ఉదా: హనుమంతుడు విశ్రాంతి, విలంబం ఎరుగని కార్యసాధకుడు.
  • రయము(నామవాచకం): వేగము/ప్రవాహము అని అర్థం.
  • జవము: వడి, వేగం గల అని అర్థం. 
  • ఎంపికల్లో ఉన్న పదాలను గమనించగా ‘ఆలస్యం, తాత్పరం’ అనే అర్థాలనిచ్చే పదం విలంబంసరైన సమాధానం అవుతుంది అని మనం చూడవచ్చును.  
Get Free Access Now
Hot Links: teen patti master app teen patti gold old version teen patti joy mod apk