Telugu Grammar MCQ Quiz in বাংলা - Objective Question with Answer for Telugu Grammar - বিনামূল্যে ডাউনলোড করুন [PDF]
Last updated on Mar 8, 2025
Latest Telugu Grammar MCQ Objective Questions
Top Telugu Grammar MCQ Objective Questions
Telugu Grammar Question 1:
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికినది ఎవరు గుర్తించండి
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 1 Detailed Solution
సరైన సమాధానం : దాశరధి కృష్ణమాచార్య
కీలక అంశం :
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరధి కృష్ణమాచార్య అన్నారు. దాశరధి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనను దయ్యబడుతూ గర్జించారు.
అదనపు సమాచారం :
- దాశరధి గా పేరు గాంచిన దాశరధి కృష్ణమాచార్య జులై 22,1925 న జన్మించారు.
- దాశరధి కృష్ణమాచార్య తెలంగాణకు చెందిన కవి, రచయిత, నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు.
- దాశరధి కృష్ణమాచార్య రచనలు అగ్నిధార, రుద్రవీణ, నేత్ర పర్వం, నవమి మొదలైనవి రచించారు.
పైన అంశాలు గమనించగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది దాశరధి కృష్ణమాచార్య అని మనం చెప్పవచ్చు.
Telugu Grammar Question 2:
జీవిత గమనం ఏ సమాసం గుర్తించండి
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 2 Detailed Solution
సరైన సమాధానం : షష్టి తత్పురుష సమాసం
కీలక అంశం :
జీవిత గమనం అనగా జీవితం యొక్క గమనం అని అర్ధం. ఇది షష్టి తత్పురుష సమాసం.
షష్టి తత్పురుష సమాసం:షష్టి తత్పురుష సమాసం నందు పూర్వపదము షష్టి విభక్తిలో ఉండును.
అదనపు సమాచారం :
ద్వంద్వ సమాసం: ఇందులో సాధారణంగా రెండు పదాలుంటే ఆ రెండు పదాల అర్ధము ప్రధానమే అవుతుంది. ఉదా: ఎండ వానలు = ఎండ మరియు వాన
ద్విగు సమాసం:సంఖ్యలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది.
ఉదా : వెయ్యి రూపాయలు = వెయ్యి సంఖ్య గల రూపాయలు
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం: సమాసములోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా ఉండును
.ఉదా : ఆది కావ్యము = ఆది యైన కావ్యము
ఉదాహరణ :
వేద శాఖలు = వేదముల యొక్క శాఖలు
పైన అంశాలు గమనించగా జీవిత గమనం అనేది షష్టి తత్పురుష సమాసం అని మనం చెప్పవచ్చు.
Telugu Grammar Question 3:
అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు - గీత గీసిన పదం యొక్క అర్థాన్ని గుర్తించండి
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 3 Detailed Solution
సరైన సమాధానం: “నిలయము”
కీలక అంశాలు:
- కరములు అంటే చేతులు అని అర్థం.
- ఆకరములు అంటే నిలయమైనవి అని అర్థం.
- పాదములుని చరణములు అని అంటారు.
- అమ్మ చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు అని ఇచ్చిన వాక్యానికి అర్థం.
- దర్శనము (vision): చూపు, చూసుట అని అర్థం. ఉదా: నాకు దేవుని దర్శనము బాగా జరిగినది.
- ఎంపికల్లో ఉన్న పదాలను మనం గమనించగా ‘నిలయము’ సరైన సమాధానం అవుతుంది అని మనం చూడవచ్చును.
Telugu Grammar Question 4:
భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 4 Detailed Solution
సరైన సమాధానం: “శ్రీనాథుడు”
కీలక అంశాలు:
- ఎంపికల్లో ఉన్న రచయితల గురించి, వారి రచనలను గమనిద్దాం.
- ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసాడు. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు.
- ఈయనకు "శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు" అనే బిరుదులు కలవు.
- ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు.
- ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం: స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
- పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. మిగితా ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.
- పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు.
- మార్గ కవిత్వమునకు నన్నయ ఆదికవియైతే- దేశ కవిత్వమునకు పాల్కురికి సోమన్న తోవ తీర్చి ఆదికవియైనాడు.
- బిరుదులు: ప్రథమాంధ్ర విప్లవ కవి, దేశీ కవిత్వోద్యమ పితామహుడు.
- రచనలు:
- పద్య ప్రకృతులు: అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకం
- లఘుకృతులు: బసవరగడ, నమస్కార గద్య, శరణుబసవ గద్య, బసవాష్టకం, బసవోదాహరణం, బసవలింగ నామావళి.
- ద్విపద కావ్యాలు: బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమదేవి పురాణం (అలభ్యం).
- పాల్కురికి సోమనాథుడు కాకతీయుల కాలానికి చెందినవాడు. పరిశోధకులు పాల్కురికి సోమనాథుణ్ని ‘తెలంగాణ ఆదికవి’గా పేర్కొంటారు. తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు.
- తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి సుస్థిర స్థానం సంపాందించి పెట్టిన వారిలో పాల్కురికి ఆద్యుడు, అగ్రగణ్యుడు. పాల్కురికి సోమనాథుడు ద్విపద కావ్య ప్రక్రియకు ఆద్యుడు. ఉదాహరణ కావ్య రచనకు మార్గదర్శకుడు.
- సంఖ్యా నియమం, మకుట నియమం ఉన్న మొదటి శతకం ‘వృషాధిప శతకం’ ఇతని రచనే.
- పాల్కురికి సోమనాథుడి తొలి రచన అనుభవసారం.
- తెలుగు సాహిత్యంలో శుద్ధమైన తొలి దేశీ స్వతంత్ర పురాణంగా బసవ పురాణం పేరొందింది. ఇది ఏడు ఆశ్వాసాల ద్విపద కావ్యం. సమకాలీన సమాజాన్ని చిత్రించిన తొలి తెలుగు సాంఘిక కావ్యం బసవ పురాణం.
- ‘ఉరుతర పద్యోక్తులకంటే సరసమై ఎరిగిన జాను తెనుగు’ అన్న కవి పాల్కురికి సోమనాథుడు.
- ఇతడి చివరి కృతి పండితారాధ్య చరిత్ర. తెలుగులో తొలిసారిగా జీవిత చరిత్ర రాసింది పాల్కురికి సోమనాథుడే అని విమర్శకుల అభిప్రాయం. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా పండితారాధ్య చరిత్రను విమర్శకులు ప్రశంసించారు.
- తిక్కన: 13వ శతాబ్దం నాటి కొట్టరువు తిక్కన నెల్లూరు నివాసి. ఇతను మనుమసిద్ధి మంత్రి. 'ఉభయ కవి మిత్రుడు', 'కవిబ్రహ్మ' అనే బిరుదులు ఉన్నాయి.
- తిక్కన మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రాశాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు.
- తిక్కన శివకేశవుల అభేదాన్ని ప్రకటించాడు. తన తొలి రచన 'నిర్వచనోత్తర రామాయణం' కావ్యాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు.
- తిక్కన కవితా రీతులు: రసాభ్యుచిత బంధం, నాటకీయత, ధ్వని (వ్యంగ్య) వైభవం, రాజనీతి, తెలుగుదనం
- తిక్కన కంద పద్యాలకు ప్రసిద్ధి. తిక్కన శిష్యుడైన కేతన తన తొలి కథా కావ్యమైన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు.
- శ్రీనాథుడు: సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం లేదా కావ్య యుగం అంటారు. కవిత్రయంతో తులతూగగల కవి శ్రీనాథుడు. అందుకే 15వ శతాబ్దానికి యుగకర్తగా శ్రీనాథుడిని పేర్కొంటారు.
- కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారిగా పనిచేశాడు.
- విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో 'గౌడడిండిమభట్టు'ను కవిత్వంలో ఓడించి కనకాభిషేకాన్ని పొందాడు. అలగే కవి సార్వభౌముడు అనే బిరుదు కూడా పొందాడు.
- చిన్నారి పొన్నారి వయసులో - 'మరుత్తరాట్చరిత్ర' రాశాడు. ఇది అలభ్యం. శ్రీనాథుడి తొలి కావ్యం. మామిడి వేమనకి అంకితమిచ్చాడు.
- నూనూగు మీసాల వయసులో - 'శాలివాహన సప్తశతి' రాశాడు. ఇది కూడా అలభ్యం. దీన్ని గాథాసప్తశతికి అనువాదంగా భావించవచ్చు.
- 'పండితారాధ్య చరిత్ర' రాసి మామిడి ప్రెగడయ్యకు అంకితం ఇచ్చాడు. ఇదీ లభ్యం కాలేదు.
- 'నిండు జవ్వనం'లో - శృంగార నైషధం రాశాడు. శ్రీహర్షుడి నైషధాన్ని శ్రీనాథుడు ఒక అనువాద ప్రణాళికతో తెనిగించాడు. దీన్ని మామిడి సింగనకి అంకితమిచ్చాడు.
- 'హరవిలాసం'లో శివుని మహిమలు, లీలల గురించి రాశాడు.
- ప్రౌఢ వయసులో శ్రీనాథుడు 'భీమఖండం' రాశాడు.
- 'శివరాత్రి మాహాత్మ్యం' అనే కావ్యాన్ని శ్రీనాథుడు వృద్ధాప్యంలో రాశాడని పేర్కొంటారు.
- శ్రీనాథుడు 'పలనాటి వీరచరిత్ర'ను ద్విపద కావ్యంగా రాసి మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు. ఇది తెలుగులో తొలి వీరగాథా కావ్యం.
- చాటుపద్యాలు రాసి ప్రజల దగ్గరకి పద్యాన్ని తీసుకెళ్లినవాడు శ్రీనాథుడు.
- శ్రీనాథుడు సీసపద్య రచనలో అందెవేసిన చేయి. శ్రీనాథుడి కవిత్వంలో ఉభయవాక్ఫ్రౌఢి, ఉద్దండలీల, సూక్తివైచిత్రి, రసాభ్యుచిత బంధం అనే కవితా గుణాలుఉన్నాయి.
- భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత - శ్రీనాథుడు
- ఎంపికలలో ఉన్న కవుల గురించి గమనించగా ‘శ్రీనాథుడు’ సరైన సమాధానం అవుతుంది.
Telugu Grammar Question 5:
ఈ క్రింది వానిలో ‘వీరభద్ర విజయం’ని రచించినది ఎవరు
Answer (Detailed Solution Below)
బమ్మెర పోతన
Telugu Grammar Question 5 Detailed Solution
సరైన సమాధానం: “బమ్మెర పోతన”
కీలక అంశాలు:
- ఎంపికల్లో ఉన్న రచయితల గురించి, వారి రచనలను గమనిద్దాం.
- పావులూరి మల్లన తొలి తెలుగు గణితశాస్త్ర గ్రంథకర్త. ఇతను గణితసార సంగ్రహము అనే గణితగ్రంథాన్ని వ్రాశాడు.
- కందుకూరి రుద్రకవి తెలుగు కవి. తెలుగులో లభ్యమౌతున్న మొట్టమొదటి యక్షగానము అయిన 'సుగ్రీవవిజయం' కర్తగా ప్రసిద్ధుడు.
- శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి కూడా ఒకడని లోకోక్తి.
- రుద్రకవి రచనలలో "సుగ్రీవ విజయం" మొదటిది. ఇది యక్షగానం. ఇది కందుకూరి జనార్ధన దేవునికి అంకితం కావించాడు.
- "నిరంకుశోపాఖ్యానం" ఇతడి రెండవ రచన. ప్రబంధ గ్రంథమైన నిరంకుశోపాఖ్యానాన్ని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు.
- రుద్రకవిని చిరస్థాయిగా నిలిపినది అతని "జనార్ధనాష్టకం". ఈయన "కందుకూరి జనార్థనా" అనే మకుటంతో జనార్థనాష్టకాన్ని రచించాడు. తెలుగులో అష్టక రచన చేసినవారిలో మొదటివాడు కందుకూరి రుద్రకవి.
- బమ్మెర పోతన: పోతన రచనలు: నారాయణ శతకం, వీరభద్ర విజయం, భోగినీ దండకం, మహాభాగవతం(తెలుగులో).
- పోతన బిరుదు: సహజ పండితుడు
- పోతన కొంతకాలం ఓరుగల్లుకి ప్రభువైన మూడో సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నారు. సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు.
- అల్లసాని పెద్దన: ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు.
- సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి శ్రీ కృష్ణదేవరాయల చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు.
- పెద్దన రచించిన మనుచరిత్ర(స్వారోచిషమనుసంభవము) ప్రథమ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినది.
- లభ్యంకాని రచనలు: హరికథా సారము, రామస్తవ రాజము, అద్వైత సిద్ధాంతము, చాటుపద్యాలు.
- ఎంపికలలో ఉన్న కవులు, రచయితల గురించి గమనించగా ‘వీరభద్ర విజయం’ రచయిత – ‘బమ్మెర పోతన’ సరైన సమాధానం అవుతుంది.
Telugu Grammar Question 6:
నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని పలికినది ఎవరు
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 6 Detailed Solution
సరైన సమాధానం : శ్రీనాధుడు
కీలక అంశం :
- నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని శ్రీనాధుడు అనడంలో అర్ధం శ్రావణానందం కలిగించే భాషలో చెబుతానని మాత్రమే అర్దం.
- సంస్కృత విద్వాంసులు శ్రీనాధుడిని డుమువుల కవి అని హేళన చేశారు.
అదనపు సమాచారం :
- శ్రీనాధుడు 1365 ప్రకాశం జిల్లాలో జన్మించారు.
- ఈతనికి కవి సార్వభౌముడను అని బిరుదు ఉంది.
- ఈయన భీమేశ్వర పూరాణం, కాశీ ఖండము, హర విలాసము , క్రీడాభిరామము మొదలైనవి రచించారు.
పైన అంశాలు గమనించగా నా కవిత్వంబు నిజము కర్ణాట భాష aని పలికినది శ్రీనాధుడు అని మనం చెప్పవచ్చు.
Telugu Grammar Question 7:
క్రింది వానిలో జాతీయం కానిది ఏది గుర్తించండి
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 7 Detailed Solution
సరైన సమాధానం : మంత్రాలకు చింతకాయలు రాలతాయ
కీలక అంశం :
మంత్రాలకు చింతకాయలు రాలతాయ అనేది ఒక సామెత. సంప్రదాయబద్ధమైన నమ్మకానికి వ్యతరేఖంగా వచ్చినది.
అదనపు సమాచారం :
- ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం.
- జాతీయాలనే పదబంధాలనీ , పలుకుబడులనీ అంటారు.
- విడివిడి మాటలు కలిసి విశేషార్ధంలో ఏర్పడేది జాతీయం.
ఉదాహరణ :
నత్తనడక = ఏదైనా పని తొందరగా చేయని సందర్భంలో ఉపయోగిస్తారు.
పైన అంశాలు గమనించగా జాతీయం కానిది మంత్రాలకు చింతకాయలు రాలతాయ అని మనం చెప్పవచ్చు.
Telugu Grammar Question 8:
‘కావ్యాలంకార చూడామణి’ అనే గ్రంథ రచయిత ఎవరు
Answer (Detailed Solution Below)
విన్నకోట పెద్దన
Telugu Grammar Question 8 Detailed Solution
సరైన సమాధానం: “విన్నకోట పెద్దన”
కీలక అంశాలు:
- విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు రచించిన 'కావ్యాలంకారచూడామణి' అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను. ఇది తెలగులో తొలి అలంకార గ్రంథం.
- చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన కవి. చరిగొండ గ్రామానికి చెందిన ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు.
- పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చరిగొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల అతడిని ఆ జిల్లావాడుగా పరిగణించడం జరిగింది.
- విప్రనారాయణ చరిత్రని రచించినవాడు చదలవాడ మల్లన.
- అద్దంకి గంగాధర కవి (సా.శ.1550 - 1580) గోల్కొండ రాజ్యానికి (నేటి తెలంగాణ ప్రాంతం) చెందిన తెలుగు కవి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. భారతంలోని తపతీ సంవరణుల కథను స్వీకరించి తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధం రచించి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చాడు.
- ఇచ్చిన ఎంపికలని గమనించగా ‘విన్నకోట పెద్దన’ సరైన సమాధానం అవుతుంది.
Telugu Grammar Question 9:
క్రింద ఇచ్చిన వాటిలో ‘మౌక్తికము’ అనే పదానికి వికృతి పదం కాని దానిని గుర్తించండి.
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 9 Detailed Solution
సరైన సమాధానం: “ముత్తము”
కీలక అంశాలు:
- సంస్కృతి, ప్రాకృత శబ్దాలను ప్రాకృతిక/ప్రకృతి పదాలు అంటాము.
- సంస్కృత, ప్రాకృత పదాల నుండి పుట్టినవి తత్సమ/ తద్భవ పదాలు. ఈ తద్భవ పదాలనే వికృతి పదాలు అంటాం. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.
- మౌక్తికము(నామవాచకం) అనగా ముత్యము అని అర్థం.
- ‘మౌక్తికము’ అనే ప్రాకృతిక పదానికి వికృతి పదాలు: ముత్తెము, ముత్తియము, ముత్యము
- ఎంపికలలో ఉన్న పదాలని గమనించగా “ముత్తము” సరైన సమాధానం అవుతుంది.
Telugu Grammar Question 10:
‘ఆలస్యం, తాత్పరం’ అనే అర్థాలనిచ్చే పదం
Answer (Detailed Solution Below)
Telugu Grammar Question 10 Detailed Solution
సరైన సమాధానం: “విలంబం”
కీలక అంశాలు:
- ఎంపికల్లో ఉన్న పదాలను, వాటి అర్థాలను మనం గమనిద్దాం.
- వేగము(నామవాచకం): త్వరితము/శీఘ్రము, తొందరగా అని అర్థాలు. వేగమునకు వ్యతిరేక పదం – నిదానము
- విలంబం: నెమ్మది, ఆలస్యం, తాత్పరం. ఉదా: హనుమంతుడు విశ్రాంతి, విలంబం ఎరుగని కార్యసాధకుడు.
- రయము(నామవాచకం): వేగము/ప్రవాహము అని అర్థం.
- జవము: వడి, వేగం గల అని అర్థం.
- ఎంపికల్లో ఉన్న పదాలను గమనించగా ‘ఆలస్యం, తాత్పరం’ అనే అర్థాలనిచ్చే పదం “విలంబం” సరైన సమాధానం అవుతుంది అని మనం చూడవచ్చును.